తెలంగాణ , సూర్యాపేట 11-ఏప్రిల్-2025: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కి ధాన్యం తీసుకొస్తే ఖరీదు దారులు, కమిషన్ దారులు మార్కెట్ అధికారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.

మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన బత్తుల లింగరాజు అనే రైతు ఐదు ఎకరాలు కౌలుకు చేసి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు 70 బస్తాల ధాన్యం తీసుకురాగా.. అతి తక్కవ ధర పలకడంతో పెట్టిన పెట్టుబడి కూడా సరిగా రాలేదని ఆవేదన చెంది ధాన్యాన్ని తగులబెట్టాడు.
రెండు రోజులుగా అన్నం తినకుండా ధాన్యం రాశి వద్ద పడుకున్నానని.. కనీసం మద్దతు ధర కూడా రాక పోతే బ్రతికేది ఎలాగని అధికారులను ప్రశ్నించిన రైతు.
స్వయం గా రాష్ట్రమే మద్దతు దార చెల్లించి రైతుల దగ్గర కొంటాం అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాట ఉత్తమాటే అని , రైతులు విమర్శిస్తున్నారు







