కబ్జాకోరులకు సహాయం చేస్తూ వారికి మద్దతిస్తున్న రామసముద్రం ఎమ్మార్వో నిర్మలా దేవి, పోలీసులు
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చిట్టెంవారి పల్లి గ్రామంలో మట్టి పోసి అడ్డంగా బండలేసి నడిరోడ్డును, గ్రామ చెరువును, ప్రభుత్వ భూములను చిన్నప్పగారి రెడ్డప్ప, లక్ష్మణగారి అంజప్ప, బోడె రెడ్డప్ప అనే కబ్జా చేసారు అని ఆవేదన చెందుతున్న జవాన్
వీరి కబ్జాల వల్ల అన్యాయానికి గురైన పారా మిలిటరీ జవాన్ మోహన్ సోదరుడితో సహా 45 మంది బాధితులు.
కబ్జాలపై ప్రశ్నించిన వారిపై మారణాయుధాలతో దాడి చేసి, మహిళలను అసభ్యంగా బూతులు తిడుతున్న కబ్జాకోరులు.
ఈ కబ్జాకోరులకు మద్దతుగా నిలిచిన రామసముద్రం ఎమ్మార్వో నిర్మలా దేవి.2023లో భూములు ఆక్రమించారని ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోని ఎమ్మార్వో, పోలీసులు.
మన దేశం కోసం, మన భూమి కోసం, మన కోసం పోరాడుతున్న జవాన్ భూమిని కబ్జాకోరులు కబ్జా చేస్తుంటే కనీసం స్పందించరా? అని ఆవేదన వ్యక్తం చేసిన జవాన్
అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా కబ్జాదారులకు మద్దతుగా ఉంటున్న మండల రెవెన్యూ తహసీల్దార్.. పట్టించుకోని పోలీసులు
దీనిపై హైకోర్టులో పిల్ వేసిన జవాన్ సోదరుడు మోహన్.. కేసు కోర్టులో ఉన్నా కబ్జా భూమిపై పెత్తనం చెలాయిస్తున్న కబ్జాకోరులు. దీనిపై వెంటనే స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.






