ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో బొలేరో వాహనం బోల్తా పడి ఈ ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి దర్శనం చేసుకుని ఆదోనికి వస్తుండగా వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలవ్వగా ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వీరిలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని మాత్రం కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ప్రమాదంలో ఆదోనికి చెందిన గిడ్డయ్య (42), శశికళ (40), లక్ష్మీ (28), చంద్రమ్మ (30)లు మృతి చెందినట్లు గుర్తించారు.







