ఖానాపూర్/నిర్మల్ జిల్లా: రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ చేస్తేనే లోన్ సెటిల్మెంట్ చేస్తామని బ్యాంకు అధికారులకు తేల్చిచెప్పిన రైతులు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో వన్ టైం లోన్ సెటిల్మెంట్ ప్రోగ్రాం నిర్వహించిన ఎస్బీఐ బ్యాంక్ అధికారులు పంట రుణాలను సీఎం రేవంత్ రెడ్డి కడతానని హామీ ఇచ్చారని, తాము లోన్ సెటిల్మెంట్ చేసుకోబోమని తేల్చి చెప్పిన పలువురు రైతులు. బ్యాంకు అధికారులతో వాగ్వాదం.

మరోపక్క, రేవంత్ రెడ్డి వచ్చాక పొట్టకు, బట్టకు కూడా డబ్బులు మిగుల్తలేవు, మాకు 6 ఎకరాల పొలం ఉంది ఒక్క పైసా కూడా రైతుబందు పడలేదు, రైతుబందు పడితే విత్తనాలకో, చిన్న చిన్న ఖర్చులకో పనికొచ్చేది ఇప్పుడు రైతుబందు లేక ఇబ్బంది అవుతుంది, రూ.500 బోనస్ కూడా పడలేదు, ఇందిరమ్మ ఇళ్ళు కోసం చాలా సార్లు తిప్పించుకొని, మళ్ళీ ఇంకోసారి దరఖాస్తు పెట్టుకోమంటున్నారు.
రేవంత్ రెడ్డి అన్ని ఉత్తి మాటలు చెప్పి మోసం చేసిండు, ఇంకోసారి జనాలు రేవంత్ రెడ్డికి అసలే ఓటు వెయ్యము అని మహిళలు గట్టిగ చేస్తున్నారు







